ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! కేబినెట్లో కీలక నిర్ణయం!
Wed May 07, 2025 20:26 Education.202505074659.jpg)
ఏపీలోని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఐదు ఐఐటీలలో సీట్ల సంఖ్యను పెంచాలని, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు. తిరుపతి ఐఐటీ సహా ఐదు ఐఐటీలలో విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలనే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని ఐదు ఐఐటీలలో విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలో ఏపీలోని తిరుపతి ఐఐటీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలలో కొత్తగా స్థాపించిన ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)లలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐదు ఐఐటీలలో ఐఐటీ తిరుపతి, ఐఐటీ పాలక్కాడ్, ఐఐటీ భిలాయ్, ఐఐటీ జమ్మూ, ఐఐటీ ధార్వాడ్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!
మొత్తం రూ.11,828.79 కోట్లు ఖర్చుచేసి ఈ ఐదు ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 2028-29 లోగా అంటే నాలుగేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే ఈ ఐదు ఐఐటీలలో 130 ఫ్యాకల్టీ పోస్టులు పెంచేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఈ ఐదు ఐఐటీలలో ( తిరుపతి ఐఐటీ) సీట్లను 6500పైగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. మరింత మందికి మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి సంవత్సరంలో 1364 విద్యార్థులు, రెండో సంవత్సరంలో 1738 మంది విద్యార్థులు, మూడో ఏడాదిలో 1767 మంది, నాలుగో ఏడాదిలో 1707 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఐదు ఐఐటీలలో 7111 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఐఐటీలలో మరో 6500 సీట్లను పెంచడం ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో చదువుకోవాలన్న విద్యార్థుల కలను నెరవేర్చవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే నైపుణ్యం కలిగిన యువతను అందించడంతో పాటుగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చని.. ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా దేశ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఐఐటీలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, ఫ్యాకల్టీ నియామకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
అంగన్వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!
'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #IITTirupati #IITExpansion #IITSeatsIncreased #APStudents #EducationNews #HigherEducation
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.